Thursday, September 24, 2020

KGBV



Read also:

కేజీబీవీల్లో 27లోగా చేరాలి


సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న 171 కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో 2020 -21 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు పరిశీలన జరుగుతోందని ఎస్పీడీ కె. వెట్రిసెల్వి తెలిపారు. బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ నెల 11 నుంచి 18 వ తేదీ వరకు మొదటి జాబితాకు సంబంధించిన విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన జరిగిందని, రెండో విడతలో ఎంపిక చేసిన విద్యార్థుల జాబితా సంబంధిత కేజీబీవీలకు పంపామన్నారు. మొబైల్ నెంబర్ కు సమాచారం అందిన విద్యార్థులు సెప్టెంబరు 24 వ తేదీ నుంచి 27వ తేదీలోగా సంబంధిత కేజీబీవీలలో స్పెషల్ ఆఫీసర్లకు రిపోర్ట్ చేయాలని సూచించారు. సందేహాల నివృత్తి కోసం 94412 70099, 94943 89617 నెంబర్లలో సంప్రదించాలని ఎస్పీడీ కె. వెట్రిసెల్వి సూచించారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :