Read also:
కేజీబీవీల్లో 27లోగా చేరాలి
సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న 171 కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో 2020 -21 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు పరిశీలన జరుగుతోందని ఎస్పీడీ కె. వెట్రిసెల్వి తెలిపారు. బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ నెల 11 నుంచి 18 వ తేదీ వరకు మొదటి జాబితాకు సంబంధించిన విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన జరిగిందని, రెండో విడతలో ఎంపిక చేసిన విద్యార్థుల జాబితా సంబంధిత కేజీబీవీలకు పంపామన్నారు. మొబైల్ నెంబర్ కు సమాచారం అందిన విద్యార్థులు సెప్టెంబరు 24 వ తేదీ నుంచి 27వ తేదీలోగా సంబంధిత కేజీబీవీలలో స్పెషల్ ఆఫీసర్లకు రిపోర్ట్ చేయాలని సూచించారు. సందేహాల నివృత్తి కోసం 94412 70099, 94943 89617 నెంబర్లలో సంప్రదించాలని ఎస్పీడీ కె. వెట్రిసెల్వి సూచించారు.