Wednesday, September 23, 2020

IIIT Admission Notification soon



Read also:

ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లకు త్వరలో నోటిఫికేషన్ - ఆర్జీయూకేటీ ఛాన్సలర్   కె.చెంచురెడ్డి


మూడు, నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ట్రిపుల్ ఐటీలకు 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ కానుంది. ఆర్జీయూకేటీ ఛాన్సలర్   కె.చెంచురెడ్డి మంగళవారం ఈ విషయం తెలిపారు. ఇడుపులపాయలోని ఆర్కే వ్యాలీ గెస్టహౌస్లో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఇంటర్వ్యూల తీరును పర్యవేక్షించేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ట్రిపుల్ ఐటీలలో అడ్మిషన్ల ప్రక్రియ త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.

- తెలంగాణలోని బాసర ట్రిపుల్ ఐటీలో నాన్ లోకల్ కింద ఏపీకి రావాల్సిన 225 సీట్లు నష్టపోకుండా ఉండేందుకు అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం.

- ఇంజినీరింగ్ చివరి, ఇంటర్ రెండవ సంవత్సరం విద్యార్థులకు కూడా త్వరలో పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తాం.

- విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం ఇడుపులపాయ ఆర్కే వ్యాలీలోనే ఉంటుంది. విజయవాడ లేదా విశాఖకు తరలిస్తారన్న వదంతులను నమ్మవద్దు. విద్యాలయానికి రెగ్యులర్ వైస్ చాన్స్ లర్, డైరెక్టర్ లను నియమిస్తాము. 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :