Tuesday, September 29, 2020

Babri Masjid Demolition Verdict



Read also:

రేపు బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు పూర్తి వివరాలు

అయోధ్యలో రామ జన్మభూమి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేటప్పుడు దేశంలో ఎలాగైతే ఆసక్తికర వాతావరణం ఉందో. మళ్లీ ఇప్పుడు బుధవారం బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో రాబోయే తీర్పుపై దేశమంతా ఆసక్తి ఉంది. 1992 డిసెంబర్ 6న కరసేవకులు. అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చేశారు. దాదాపు 28 ఏళ్లు గడిచిపోయాయి. లక్నోలోని ప్రత్యేక సీబీఐ కోర్టు. బుధవారం అంటే. సెప్టెంబర్ 30న ఈ కేసులో కీలక తీర్పు ఇవ్వనున్నట్లు తెలిసింది. బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చేయడానికి ప్రేరేపించినది ఎవరు? అనేది ఈ కేసులో కీలక అంశంగా మారింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల్లో. మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్, అనాటీ బీజేపీ నేతలు మురళీ మనోహర్ జ్యోషీ, ఉమాభారతి, వినయ్ కటియార్, సాక్షి మహరాజ్ తదితరులు నిందితులుగా ఉన్నారు.


ఎప్పుడో రావాల్సిన తీర్పు. దర్యాప్తు, విచారణ. నత్తలతో పోటీ పడుతూ సాగడంతో 28 ఏళ్లు గిడిచిపోయాయి. లక్నోలోని ఓల్డ్ హైకోర్టు బిల్డింగ్‌లో ఓ మూల ఈ కేసు విచారణ జరిగింది. 2017 ఏప్రిల్ 19న సుప్రీంకోర్టు. ఈ కేసు విచారణను రోజువారీ చేపట్టాలని ఆదేశించింది. ఈ కేసును విచారిస్తున్న జడ్జిని ట్రాన్స్‌ఫర్ చేయవద్దని ఆదేశించింది. ఇప్పటికి విచారణ పూర్తై. కేసు పూర్వాపరాలన్నీ ప్రింట్ అయ్యాయి.

అసలేంటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసు:

అయోధ్యలో రామాలయం ఉన్న ప్రదేశంలో. దాన్ని కూల్చి. బాబ్రీమసీదును నిర్మించారనే అంశంతో. ఆ మసీదును కూల్చేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. 1992లో దేశవ్యాప్తంగా కరసేవకులు అయోధ్యకు తరలివచ్చారు. ఒక్కసారిగా బాబ్రీ మసీదును చేరి. డిసెంబర్ 6న దాన్ని ధ్వంసం చేశారు. దేశం మొత్తం ఆశ్చర్యంగా చూసింది. ఆ సమయంలో. పెద్ద ఎత్తున దేశమంతా మత ఘర్షణలు జరిగాయి. వాటిలో 1800 మంది చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

2019 నవంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన అయోధ్య రామ జన్మభూమి స్థలం కేసూ. ఈ బాబ్రీ మసీదు కూల్చివేత కేసూ. రెండూ వేర్వేరు. ఆ కేసులో రామజన్మభూమిలో రామాలయం కట్టుకోవచ్చనే తీర్పు రావడం. దానికి ఈ ఏడాది ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్రమోదీ భూమిపూజ చేయడం అన్నీ జరిగాయి.

ఈ కేసులో పోలీసులు 2 FIRలు రాశారు. ఒక దాంట్లో లక్షల మంది కరసేవకులకు వ్యతిరేకంగా కేసు రాశారు. రెండో దాంట్లో. 8 మంది రాజకీయ నేతలకు వ్యతిరేకంగా కేసు రాశారు. ఆ 8 మంది ఎవరంటే. బీజేపీకి చెందిన ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జ్యోషీ, ఉమా భారతి, వినయ్ కటియార్. విశ్వ హిందూ పరిషత్‌కి చెందిన అశోక్ సింఘాల్, గిరిరాజ్ కిషోర్, విష్ణు హరి దాల్మియా, సాథ్వీ రితంభర. వీరిలో దాల్మియా, గిరిరాజ్ కిషోర్, సింఘాల్ చనిపోయారు. ఉమా భారతికి కరోనా రావడంతో. రుషికేష్ ఎయిమ్స్‌లో చేరారు. మిగతా వారు రేపు కోర్టుకు హాజరయ్యే ఛాన్సుంది.

ఈ కూల్చివేత అంశంపై మరో 47 FIRలు కూడా నమోదయ్యాయి. కొంత మంది జర్నలిస్టులపై దాడులు జరిగిన కేసులు కూడా వీటిలో ఉన్నాయి. కరసేవకులకు సంబంధించిన కేసును సీబీఐకి అప్పగించారు. నేతలకు సంబంధించిన కేసును సీఐడీకి అప్పగించారు. ఈ గందరగోళమంతా ఏంటని. 1993 ఆగస్టు 27న అన్ని కేసుల్నీ యూపీ ప్రభుత్వం సీబీఐ చేతిలో పెట్టింది.1993 అక్టోబర్ 5న సీబీఐ. మొదటి ఛార్జిషీట్ ఫైల్ చేసింది 40 మందికి వ్యతిరేకంగా. వాళ్లలో ఆ 8 మంది నేతలూ ఉన్నారు. రెండేళ్ల దర్యాప్తు తర్వాత మరో చార్జిషీట్‌ని 1996 జనవరి 10న దాఖలు చేసింది. బాబ్రీమసీదు కూల్చివేతు ఓ భారీ ప్లాన్, ఓ కుట్ర జరిగిందని చెప్పింది. ఆ తర్వాత సీబీఐ. క్రిమినల్ నేరపూరిత కుట్ర జరిగిందంటూ. మరో 9 మంది పేర్లను ఇందులో చేర్చింది. వారిలో శివసేన నేతలు బాల్ థాక్రే, మోరేశ్వర్ సావే కూడా ఉన్నారు.

1997లో లక్నో మేజిస్ట్రేట్. 48 మంది కుట్రకు పాల్పడినట్లు తెలిపింది. వారిలో 34 మంది అలహాబాద్ హైకోర్టుకు వెళ్లి. కింది కోర్టు తీర్పుపై స్టే తెచ్చుకున్నారు. ఈ స్టే కారణంగా. ఈ కేసు ముందుకు సాగలేదు. 2001 ఫిబ్రవరి 12న అలహాబాద్ హైకోర్టు. అద్వానీ, జ్యోషి, ఉమా భారతి, యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్, ఇతరులపై ఉన్న క్రిమినల్ కుట్ర అభియోగాలను కొట్టేసింది. అంతే సీబీఐ గాలి తీసిన బుడగలా అయిపోయింది.

మూడు నెలల తర్వాత. మే 4న. లక్నో ప్రత్యేక కోర్టు. రెండు కేసుల్నీ వేర్వేరుగా చేసి. 21 మంది నిందితుల్ని రాయ్ బరేలీలో, 27 మంది నిందితుల్ని లక్నోలో విచారించాలని డిసైడైంది. 2010 వరకూ రెండు కేసులపై. రెండు వేర్వేరు కోర్టుల్లో విచారణ జరిగింది. దీనిపై 2011లో సీబీఐ. సుప్రీంకోర్టుకు వెళ్లడంతో. సుప్రీంకోర్టు. రెండు కేసుల్నీ. లక్నో ప్రత్యేక కోర్టులోనే విచారించాలని చెప్పింది.


2017 ఏప్రిల్ 19న సుప్రీంకోర్టు. అద్వానితోపాటూ. మిగతా వారిపైనా నేరపూరిత కుట్ర కోణంలో విచారణ జరపాలని చెప్పింది. దాంతో గాలిపోయిన బుడగలా మారిన సీబీఐ మళ్లీ గాలి నింపిన బెలూన్ లా మారింది. దాదాపు 40వేల మంది ప్రత్యక్ష సాక్షుల్ని కోర్టు విచారించింది. వాళ్లు చెప్పిన మాటలే సాక్ష్యాలుగా తీసుకుంది. పోలీసులు ఇచ్చినవీ ఉన్నాయి. ఛానెళ్లు 100కు పైగా క్యాసెట్లను సమర్పించాయి.

తీర్పు ఎలా ఉంటుందో, ఎవరికి వ్యతిరేకంగా ఉంటుందో అనే ఉద్దేశంతో. కేంద్ర ప్రభుత్వం ఒకింత టెన్షన్ పడుతోంది. ఏవైనా అలర్లు జరుగుతాయేమో అని అన్ని రాష్ట్రాలనూ అలర్ట్ చేసింది. నిఘా వర్గాలు మాత్రం అల్లర్లు జరిగే ఛాన్స్ ఉంటుందనీ, అయోధ్యా రామాలయ తీర్పు తర్పాత. ఈ తీర్పు కోసం ఎదురుచూస్తున్న వారు. తీర్పు నచ్చకపోతే. అల్లర్లకు పాల్పడ వచ్చని చెప్పాయి. అందుకే కేంద్రం టెన్షన్ పడుతోంది.

నిజానికి దేశ ప్రజలు ఇప్పుడు ఇలాంటి తీర్పుల్ని తెలుసుకునే ఆసక్తితో లేరు. తెల్లారి లేస్తే. కరోనా కష్టాలు వారిని వెంటాడుతున్నాయి. రోజు ఎలా గడవాలి, అప్పులు ఎలా తీర్చాలన్నదే వారికి అతి పెద్ద సమస్య. ఊసురోమని ప్రజలు ఉన్న సమయంలో. ఏ తీర్పు వచ్చినా. ఏం స్పందన ఉంటుంది అన్నది మరో కోణం.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :