AP Open School SCC, Inter Exams July 2020 Declared All Pass
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం, గుంటూరు వారిచే నిర్వహించబడు ఎస్. ఎస్.సి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, 2020 మొదటగా 25.04. 2020 నుండి 02.05.2020 వరకు నిర్వహించబడవలసి ఉండగా COVID-19 పరిస్థితుల వలన, లాక్ డౌన్ విధించినందు వల్ల 18.07.2020 నుండి 24.07.2020 వరకు జరుపుటకు గాను వాయిదా వేయబడినది. ఆ తరువాత కూడా పరిస్థితులలో మార్పు లేనందు వల్ల పరీక్షకు హాజరగు అభ్యాసకుల క్షేమము మరియు భద్రత దృష్ట్యా ప్రభుత్వము జులై-2020 లో జరగవలసిన ఎస్.ఎస్.సి. మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను రద్దు చేయడమైనది మరియు పరీక్ష ఫీజు కట్టి పరిక్షకు హాజరగుటకు అర్హత కలిగిన అభ్యాసకులందరినీ ఉత్తీర్ణత చేస్తూ వారికి మార్కులు మరియు గ్రేడ్ లను వారికి ప్రిపరేటరీ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మార్కులు మరియు గ్రేడ్లు ఇచ్చుటకు నిర్ణయించబడినది.ఈ పరీక్షలకు సంబంధించిన ఎస్.ఎస్.సి. పరీక్షలకు 71, 210 మంది మరియు ఇంటర్మీడియట్ పరీక్షలకు 97, 507 అభ్యాసకులు మొత్తము 1,68,717 పరీక్ష ఫీజు కట్టి పరీక్ష హాజరగుటకు అర్హత పొంది ఉన్నారు.