Saturday, June 20, 2020

Good news for 10th class students



Read also:

ఏపీలో పదవతరగతి పరీక్షలు రద్దు పదవ తరగతి పరీక్షలు ఏపీలో పదవతరగతి పరీక్షలు రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.కరోనా నేపధ్యంలో పదవతరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.మొదట యధాతధంగా పరీక్షలు నిర్వహించాలని భావించినా ,రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో 6.3లక్షల మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు.కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సురేశ్ తెలిపారు.

ఏపీలో టెన్త్‌ పరీక్షలు రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు ఇప్పటికే పదవ తరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులకు గ్రేడ్‌లు ఇచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం కూడా టెన్త్‌ పరీక్షలు రద్దు చేస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సాయంత్రానికి పరీక్షలపై క్లారిటీ రానుంది. 5 గంటలకు మంత్రి ఆదిమూలపు సురేష్ టెన్త్ పరీక్షలపై స్పష్టత ఇస్తారు. రాష్ట్రంలో కరోనా విజృభిస్తోంది. కరోనా కేసులు 500లకుపైగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేనతో పాటు ప్రజాసంఘాలు పదవ తరగతి పరీక్షలు రద్దుచేయాలని డిమాండ్ చేశాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, రాజకీయపార్టీల డిమాండ్లతో ప్రభుత్వం సందిగ్ధంలోపడింది. దీంతో ప్రభుత్వం రద్దు చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. అత్యధికంగా మరణాలు కూడా ఈ జిల్లాల్లోనే నమోదవుతున్నాయి.

ఇదిలావుంటే వచ్చే నెలలో పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సురేష్ ప్రకటించారు. విద్యార్థులు మొత్తం 11 పేపర్లు రాయాల్సి ఉండగా వాటిని కేవలం ఆరు పేపర్లకు కుదించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నింబంధన ఈ సంవత్సరంలో పరీక్షులు రాసే రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్షలకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది మాత్రమే పేపర్లు కుదింపు ఉంటుందని వచ్చే ఏడాది నుంచి 11 పేపర్లు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :