Read also:
ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్ విద్యార్థులకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ శుభవార్త చెబ్బింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పేపర్స్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తు గడువును జూన్ 29 వరకు పొడిగించింది ఇంటర్ బోర్డు. వాస్తవానికి ఈ గడువు జూన్ 22న ముగిసింది. కానీ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోరిక మేరకు దరఖాస్తు గడువును మరో వారం రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆసక్తి గల విద్యార్థులు ఏపీ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ https://bie.ap.gov.in/ ఓపెన్ చేసి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేయొచ్చు. జూన్ 29 వరకు అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు జూన్ 12న విడుదలైన సంగతి తెలిసిందే.
Recounting Process for ap intermediate students
ముందుగా https://bie.ap.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయండి
Student ట్యాబ్ పైన క్లిక్ చేయండి.
రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ లింక్ పైన క్లిక్ చేయండి.
హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ, ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి.Get Data పైన క్లిక్ చేసి వివరాలు సరిచూసుకోండి.
సబ్మిట్ పైన క్లిక్ చేసి ప్రాసెస్ పూర్తి చేయండి.
చివరగా దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
అప్లికేషన్ నెంబర్ను రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోండి.