Saturday, May 16, 2020

Upcoming changes in the payroll system in cfms



Read also:


 CFMS HUMAN CAPITAL MANAGEMENT- ( హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అమలు ) రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలందించే విధానాన్ని మార్పు చేసింది .ఈ మార్పులను అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు అమలు చేసేందుకు నిర్ణయిం చింది . ఈ విధానాన్ని దశలవారీగా అమలు జరుపుతారు సీఎస్ఎంఎస్ రెండో దశను ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది . మొదటి దశలో ఉన్న పొర పాట్లు , ఇతర ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టింది . ' హ్యూమన్ క్యాపిటల్ మేనేజిమెంట్ ( హెచ్ సీఎం ) విధానాన్ని అన్ని ట్రెజరీ కార్యాలయాల్లో అమలు చేసేందుకు సదుపాయాలను సమకూర్చింది . ఆర్ధిక శాఖ పరిధిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బీమా ( ఏపీజీఎల్ ) స్టేట్ ఆడిట్ , పే అండ్ అకౌంట్స్ విభాగాలలో ఈనెల నుంచే ఈ విధానంలో జీతాలను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది . మిగిలిన శాఖల్లో కొత్త ఆర్థిక సంవత్సరంలో .. అంటే మార్చి తర్వాత అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది . ట్రెజరీ కార్యాలయాలల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ విధానంలో జీతాలు అందించాక మిగిలిన ఇతర శాఖ లకు విస్తరిస్తారు ఉద్యోగుల సేవా పుస్తకాలను కంప్యూటరీకరించడం వల్ల అందులో ఉన్న వివరాలన్నీ ప్రభుత్వ వెబ్ సైట్లో కూడా ఉంటాయి , ప్రతినెలా వారికి రావాల్సిన పరిహారాలు ఆటోమెటిక్ గా జనరేట్ అవుతుంటాయి . తయారుచేసిన సాఫ్ట్వేర్ ఆధారంగా ఉద్యోగుల జీతాలే కాకుండా వారికి సంబంధించిన సమస్త ఆర్థిక వ్యవహరాలు అంటే ఇంక్రిమెంట్లు , ఎన్ క్యాష్ మెంట్ లీవులు వంటివన్నీ ఏ నెలకా నెల నమోదవుతుంటాయి ఉద్యోగులకు ప్రభుత్వం కేటాయించిన ట్రెజరీ ఐడీ ఈ ఎస్ఆర్‌కు అనుసంధానం చేయడం వల్ల ఈ నంబర్ ఆధారంగా నెలవారి జీతం అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే జీతం , డీఏ , హెలప్ , ఇతర కటింగ్లన్నీ కలిపి నిఖర ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్రమంగా కార్యకలాపాలు జరుగుతాయి.తమకు ఇంక్రిమెంట్లు కావాలి , తమ జీతాలు పెంచాలని ఉద్యోగులు కోరుకునే పరిస్థితి ఉండదు . ప్రభుత్వం కరువు భత్యం పెంచిన తక్షణమే ఆ మొత్తం ఉద్యోగుల ఖాతాలలో జమ అవుతుంది . ఇంతవరకు ట్రెజరీ కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లను , ఏటీవోలను , ఇతర సిబ్బందిని ప్రసన్నం చేసుకునేందుకు ఉద్యోగులు నానాపాట్లు పడేవారు . ఇకపై ఆ పరిస్థితి ఉండదు . అధికారులకు లంచాలు అందించే ప్రక్రియకు ఏమాత్రం అవకాశం ఉండదు . అదనపు ఎరియర్లు వచ్చినా ట్రెజరీ సిబ్బం దితో సంబంధం లేకుండా నేరుగా ఉద్యోగుల బ్యాంకు ఖాతా లలో జమ అవుతుంటాయి . హెచ్ సీఎంలో ఎవరి ప్రమేయం లేకుండా ఉద్యోగులకు రావా ల్సిన ప్రయోజనాలన్నీ ఆటోమెటిగా నమోదవుతాయి . ఉద్యోగుల జీతాల వ్యవహారంలో అవినీతి అక్రమాలకు తావులేకుండా నీతివంతమైన విధానం అమల్లోకి వస్తుంది . ఈ ఎస్ఆర్ లో నమోదు చేసిన వివరాల మేరకు అన్ని కార్యక్ర మాలు పారదర్శకంగా అమలు జరిగే పరిస్థితి నెలకొంటుంది . జీతాల చెల్లింపులో వెసులుబాటు ఆర్ధిక శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన ఈ విధానం వల్ల ఉద్యోగులు , ఉపాధ్యాయుల జీతాల చెల్లింపులో ఎంతో వెసు ఉంటుందని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు గతంలో మాదిరిగా ఉద్యోగులు ఇబ్బందిపడే పరిస్థితి ఉండదు . అన్ని మండలాల ఉన్నత పాఠశాలల్లో ఉద్యోగులు , ఉపాధ్యాయులకు ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్లు అందుబాటులోకి వస్తే ఈ విధానం పని తీరు సులభతరమవుతుంది . రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఉద్యోగుల జీతాల కోసం ప్రవే శపెడుతున్న హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్ మెంటు విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది . జీతాలను అందించడానికి ఉన్నత పాఠశాలల్లో గజిటెడ్ హెచ్ఎం డీడీవోగా వ్యవహరిస్తు న్నారు . ఈ విధానం అమల్లోకి వస్తే ఈ డీడీవోల ప్రమేయం లేకుండానే జీతాలు అందుతాయని పలువురు ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు . ప్రస్తుతం మూడు ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు మాత్రమే ఈ విధానాన్ని ప్రవేశ పెట్టారు . అన్ని శాఖలకు కూడా తక్షణం అమలు చేయాలని పలువురు కోరుతున్నారు .

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :