Read also:
Teacher transfers should be undertaken immediately-Devid Chinna Babu
ఉపాధ్యాయ బదిలీలు వెంటనే చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ జిల్లా అధ్యక్షుడు డేవిడ్ చిన్నబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా ఉపాధ్యాయ బదిలీలు చేపట్టకపోవడంతో మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఏళ్ల తరబడి బదిలీల కోసం ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నా ప్రభుత్వాలు స్పందిచకపోవడం దారుణమన్నారు. కరోనా సడలింపులు ఉన్న నేపథ్యంలో ఉపాధ్యాయుల బదిలీలకు స్టేషన్ పాయింట్లు, సర్వీస్ పాయింట్లు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలన్నారు. వికలాంగుల కేటగిరీలో 75శాతం అంగవైకల్యం కలిగిన వారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈనెల నుంచి ఉపాధ్యాయులకు పూర్తివేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట ఆ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదన్రావు, తదితరులు ఉన్నారు.