Friday, May 15, 2020

Secial buses from hyd to ap



Read also:


లాక్ డౌన్లో హైదరాబాద్లో ఉండిపోయిన రాష్ట్ర ప్రజల కోసం ఏపీఎస్ఆర్టీసీ నడిపే బస్సులు శనివారం నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు . స్పందన పోర్టల్ లో నమోదైన వారికే ప్రయాణ అవకాశం ఇవ్వనున్నారు . ఏసీ , నాన్ ఏసీ బస్సుల్లో ఛార్జీ ఎంత ? ఆన్లైన్ రిజర్వేషన్ ఎన్ని గంటలకు మొదలవుతుందనే విషయాన్ని నేడు ప్రకటించనున్నారు . ప్రతి జిల్లా నుంచి పది చొప్పున 130 బస్సులు నడపనున్నారు . దిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాలకు .. ఈనాడు , దిల్లీ : దేశ రాజధాని దిల్లీ నుంచి సుమారు 120 మంది నాలుగు బస్సుల్లో గురువారం ఉదయం తెలుగు రాష్ట్రాలకు బయల్దేరారు . ఏపీ , తెలంగాణ భవన్ భద్రతా సిబ్బందితోపాటు ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల అధికారిక నివాసాల వద్ద విధులు నిర్వర్తించే వారంతా ఈ బస్సుల్లో బయల్దేరారు . నిజామాబాద్ మీదుగా హైదరాబాద్ చేరుకొనే ఈ బస్సుల్లో ఏపీకి చెందిన వారూ ఉన్నారు . ఏపీకి చెందిన వారి బస్సులకు అనుమతి వస్తే విజయవాడ లేకపోతే హైదరాబాదు వెళ్లనున్నట్లు సమాచారం .

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :