Read also:
జూన్ 1 నుంచి సాధారణ రైళ్లు ప్రారంభం.. రైల్వేశాఖ ప్రకటన
➧ప్రస్తుతానికి నాన్ ఏసీ రైళ్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని రైల్వేశాఖ వెల్లడించింది.
➧జూన్ 1 నుంచి సమయానుకూలంగా రోజుకు 200 రైళ్లను నడుపుతామని ప్రకటించింది. త్వరలోనే రైళ్లకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
➧ అయితే ముందస్తు రిజర్వేషన్ చేయించుకున్న వారికి మాత్రమే రైలు ప్రయాణానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. కౌంటర్ల ద్వారా టికెట్ బుకింగ్ చేసుకునే వెసులుబాటు ఉండదని తెలిపింది.
➧ఐతే ప్రస్తుతానికి నాన్ ఏసీ రైళ్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని రైల్వేశాఖ వెల్లడించింది. ఇప్పటికే వలస కార్మికుల కోసం రైళ్లను నడుపుతున్న కేంద్రం.. వాటికి అదనంగా మరో 200 సాధారణ రైళ్లను నడుపుతున్నట్లు స్పష్టం చేసింది.