Read also:
ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
అమరావతి: మిగిలిపోయిన ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూల్ను ఏపీ ఇంటర్ బోర్డు విడుదల చేసింది. జూన్ 3వ తేదీన సెకండియర్ మోడ్రన్ లాంగ్వేజ్-2, జాగ్రఫీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. మార్చి 23న జరగాల్సిన పరీక్షలు కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా, పరీక్షల సమయంలో విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఇంటర్ బోర్డు నిబంధన విధించింది.