Read also:
పదో తరగతి ఫీజు చెల్లింపులకు గడువును పొడిగిస్తూ ప్రభుత్వ పరీక్షల సంచాలకులు ఎ. సుబ్బారెడ్డి నూతన షెడ్యూల్ను విడుదల చేశారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం జనవరి ఏడో తేదీలోపు అన్ని పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు ఫీజులు వసూలు చేసి, బోర్డుకు పంపాలి. ఆన్లైన్లో చెల్లింపులు కూడా లేట్ ఫీజు లేకుండా జనవరి లోపు చెల్లించవచ్చు. జనవరి1వతేదీ వరకు రూ. 50 లేట్ ఫీజుతో, జనవరి 22వ తేదీ వరకురూ. 200 లేట్ ఫీజుతో, జనవరి 7వ తేదీ వరకు, రూ. 500 లేట్ ఫీజుతో చెల్లించవచ్చు. ఉప విద్యాశాఖాధికారులు జనవరి తొమ్మిదో తేదీలోపు లేట్ ఫీజు లేకుండా డీఈవోలకు ఆన్లైన్లో ఎన్ఆర్ డేటా పంపాలి.జనవరి 18వ తేదీ వరకురూ. 50, జనవరి 28వ తేదీవరకురూ. 200, జనవరి 28వ తేదీ వరకురూ. 500 లేట్ ఫీజుతో చెల్లించవచ్చు. డీ ఈవోలు డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్కు జనవరి 11వ తేదీ వరకు లేట్ ఫీజు లేకుండా పంపవచ్చు. జనవరి 20వ తేదీవరకురూ. 50, జనవరి 24వతేదీ వరకు రూ. 200, జనవరి 29వ తేదీ వరకు రూ.500 లేట్ పీజుతో చెలించవచుని సూచించారు.