Tuesday, January 7, 2020

High power committe meeting



Read also:


రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ తొలిసారిగా భేటీ అయింది. విజయవాడలోని ఆర్టీసీ బస్టాండ్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో సమావేశమైంది. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ఈ భేటీకి మంత్రులు బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, పేర్ని నాని, సుచరిత, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, గౌతమ్‌రెడ్డి, కన్నబాబు, ఆదిమూలపు సురేశ్‌తోపాటు డీజీపీ గౌతం సవాంగ్‌ సహా పలువురు అధికారులు హాజరయ్యారు.తొలుత సీఆర్డీఏ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించాలని భావించినా రైతుల ఆందోళన నేపథ్యంలో ఆర్టీసీ కాన్ఫరెన్స్‌ హాల్లోకి మార్చారు. ఏపీ సమగ్రాభివృద్ధిపై జీఎన్‌ రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలపై హైపవర్‌ కమిటీ చర్చించనుంది. మరో రెండు, మూడు దఫాలుగా సమావేశమై తుది నివేదికను హైపవర్‌ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :