Read also:
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
జిల్లాల ఇన్చార్జ్ మంత్రులతో సీఎం జగన్ సమావేశం అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చిస్తున్నారు. ఇన్చార్జ్ మంత్రులకే స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలు అప్పగించనున్నారు.
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసింది. మార్చి 3లోపు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తామని అఫిడవిట్లో పేర్కొంది. ఫిబ్రవరి 8 నుంచి మార్చి3 మధ్య గ్రామపంచాయతీ ఎన్నికలు పూర్తి చేస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. జనవరి 17 నుంచి ఫిబ్రవరి 15 మధ్య ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేస్తామని వెల్లడించింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా జనవరి 10న సీఎస్, డీజీపీ, ఆర్థిక శాఖ, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శులతో, జనవరి 13న రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం కానుంది.