Read also:
ఆరోగ్యశ్రీ ద్వారా మరిన్ని కేన్సర్ శస్త్ర చికిత్సలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మెడికల్, రేడియేషన్, సర్జికల్ ఆంకాలజీలో కొత్త శస్త్ర చికిత్సలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో పాటు శస్త్ర చికిత్సలకు ప్యాకేజీని కూడా 5 శాతం పెంచింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. విధివిధానాలను ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న శస్త్ర చికిత్సల్లో 8 చికిత్సలను తొలగించారు. మరోవైపు కేన్సర్ శస్త్ర చికిత్సల గురించి సోమవారం విజయవాడలోని హోటల్ మురళీఫార్చ్యూన్లో ఆరోగ్యశ్రీ అధికారుల సమావేశం నిర్వహించారు. కేన్సర్ నివారణ ప్రక్రియలు, కార్యక్రమాల అమలుపై విస్తృతంగా చర్చించారు.