Read also:
ఎక్స్2 ప్రో.చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం రియల్ మీ నుంచి వచ్చిన కొత్త మోడల్. అదిరే ఫీచర్లతో ఇటీవలే మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్ ధర రూ.29,999. స్పెసిఫికేషన్స్ బాగున్నా ఖరీదు కాస్త ఎక్కువని అనుకునేవారికి తాజాగా శుభవార్త చెప్పింది రియల్మీ.తక్కువ ధరకే ఎక్స్2 ప్రో 6జీబీ విత్ 64జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 855 ఎస్ఏసీతోపాటు 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ సామర్థ్యం గల ఈ ఫోన్ 6.5 అంగుళాల ఎఫ్హెచ్డీ+ (2400X1080 పిక్సెల్స్) సూపర్ అమోలెడ్ కార్నింగ్ విత్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. ఇంకా 90 హెర్జ్ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్ కెమెరా దీని ప్రత్యేకతలు.64 ఎంపీ సెన్సార్తోపాటు 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సార్, 13 ఎంపీ టెలి ఫొటో సెన్సార్, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.
6జీబీ విత్ 64జీబీ వేరియంట్ ఎక్స్2 ప్రో ఫోన్లో కెమెరా విషయమై సంబంధించి రియల్మీ ఎలాంటి మార్పులు చేస్తుందో వేచి చూడాలి. రియల్మీ ఎక్స్ 2 ప్రో మాస్టర్ ఎడిషన్ 12 జీబీ+256 జీబీ వేరియంట్ మంగళవారమే మార్కెట్లోకి వచ్చింది. ఇది పూర్తిగా భిన్నమైన డిజైన్తో ప్రీమియం లుక్తో ఆకట్టుకుంటోంది. కాంక్రీట్, రెడ్ బ్రిక్ అనే రెండు కలర్ వేరియంట్లలో లభిస్తోంది.
ఈ ఫోన్ వెనుక భాగం మ్యాట్ ఫినిష్తో ఉంది. మాస్టర్ ఎడిషన్ ధర రూ.34,999. ఈ స్మార్ట్ ఫోన్ సోమవారం నుంచి ఫ్లిప్కార్ట్, రియల్మీ వెబ్సైట్ల్లో అందుబాటులోకి వచ్చింది. జియో చందాదారులకు సుమారు రూ.11,500 వరకు ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది.