Read also:
శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) కార్డుతో ఆధార్ అనుసంధానం గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పొడిగించింది. రేపటితో గడువు ముగుస్తుండగా.. తాజాగా దాన్ని వచ్చే ఏడాది (2020) మార్చి 31 వరకు పొడిగించింది. పాన్- ఆధార్ అనుసంధానం ఈ ఏడాది ఏప్రిల్లో కేంద్రం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. రిటర్నులు దాఖలు చేసే వారికి అనుసంధానం తప్పనిసరి. డిసెంబర్ 31లోపు ఆధార్ అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు చెల్లదని ఐటీ శాఖ ప్రకటించింది. అంతకుముందు సెప్టెంబర్లో ఓ సారి గడువును పొడిగించారు.