Read also:
ఈ నెల 31న మాస్టర్ ట్రైనీలతో మండల స్థాయిలో సీఆర్పీ, వార్డు,గ్రామ సచివాలయాల్లో కొత్తగా చేరిన వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు శిక్షణ ఇస్తారు. అదే రోజున పేరెంట్ కమిటీలకు అవగాహన కల్పిస్తారు.
జనవరి 5లోగా అంచనాలు సిద్ధమవ్వాలి. వాటి సాంకేతిక అనుమతి కోసం రిపోర్టు డీఈవోకు పంపాలి. వాటిని పరిశీలించాక పరిపాలనా ఆమోదం కోసం ఫైల్ కలెక్టర్కు వెళ్తుంది. అదే రోజున కలెక్టర్ వాటికి అనుమతి ఇస్తారు.
జనవరి 5 నాడు పథకానికి సంబంధించి బ్యాంకు ఖాతాలు తెరవాలి. పాఠశాల హెచ్ఎం, పేరెంట్ కమిటీ చైర్మన్, మరికొందరి సభ్ల్యులతో ఖాతాలు ప్రారంభించాలి. వాటిని ఎస్టీఎంఎస్ యాప్లో అప్లోడ్ చేయాలి.
జనవరి 8న పనుల ప్రారంభానికి అవసరమైన అంచనా విలువలో 15 శాతం నిధులు తీసుకోడానికి పేరెంట్ కమిటీ తీర్మానం చేయాలి.
10న సంబంధిత ఇంజనీరింగ్ శాఖల ఈఈలతో పేరెంట్ కమిటీలు ఒప్పందం చేసుకోవాలి. అదే రోజున పనులు ప్రారంభించాలి.