Read also:
డిసెంబర్ 6 నుంచి చార్జీలు పెంచనున్న జియో టెలికాం సంస్థలు వొడాఫోన్ ఐడియా , ఎయిర్ టెల్ లు తమ ప్రీపెయిడ్ వినియోగదారులకు అందిస్తున్న మొబైల్ టారిప్లను పెంచిన విషయం విదితమే.ఈ క్రమంలోనే ఆయా సంస్థలు పెంచిన ధరల ప్రకారం నూతన రీచార్జి ప్లాన్లను ప్రవేశపెట్టాయి.ఇక ఆ ప్లాన్లు ఇవాళ అర్ధరాత్రి నుంచే అమలులోకి రానుండగా , మరో వైపు జియో డిసెంబర్ 6వ తేదీ నుంచి మొబైల్ టారిఫ్ ను పెంచుతున్నట్లు తెలిపింది.మొబైల్ టారి పెంపులో భాగంగా జియో డిసెంబర్ 6వ తేదీన నూతన ఆలిన్ వన్ ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది.ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న ప్లాన్ల ధరలు 40 శాతం వరకు పెరుగుతాయని జియో వెల్లడించింది.అయితే పెంచిన చార్జిలకు అనుగుణంగా కస్టమర్లకు ప్రయోజనాలను అందిస్తామని జియో తెలిపింది .ఈ క్రమంలోనే నూతన ప్లాన్లపై 300 శాతం అదనపు ప్రయోజనాలను అందిస్తామని వెల్లడించింది.