Read also:
గ్రామ, వార్డు, సచివాలయాలు : జనవరి 1వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్లైన్లోనే సేవలను అందించేందుకు అవసరమైన ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇంటర్నెట్, విద్యుత్ సౌకర్యంతోపాటు స్మార్ట్ ఫోన్లు, ల్యామినేషన్ యంత్రాలు, సిమ్ కార్డులు, ఫింగర్ ప్రింటింగ్ స్కానర్లు, ప్రింటర్లను ప్రభుత్వం సమకూర్చింది.
- డిసెంబర్ 27వ తేదీ నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి, అదే రోజు నుంచి ప్రయోగాత్మకంగా ఆన్లైన్ ద్వారా కార్యకలాపాలు అమలు.
- కొన్ని సేవలను దరఖాస్తు చేయగానే అక్కడికక్కడే అందిస్తారు.ఇంకొన్ని సేవలను 72 గంటల్లోగా, మరికొన్ని సేవలను 72 గంటలు దాటిన తరువాత అందిస్తారు.
- మొత్తం 500కు పైగా సేవలను ప్రజలకు అందించేందుకు అధికారులు కసరత్తు.
- 72 గంటల్లోగా 148 రకాల సేవలను, 72 గంటల తర్వాత 311 రకాల సేవలను అందించవచ్చని గుర్తించారు.
- గ్రామ, వార్డు సచివాయాల కోసం ప్రత్యేక పోర్టల్ రూపొందిస్తున్నారు. ఈ పోర్టల్ను ముఖ్యమంత్రి డ్యాష్బోర్డుతో పాటు సంబంధిత శాఖలతో అనుసంధానిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇకపై నిత్యం స్పందన కార్యక్రమం నిర్వహించనున్నారు.