Read also:
ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం -పలు కీలక నిర్ణయాలు
1. మహిళలకు అండగా వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం-ఏపీ క్రిమినల్ లా కు (సవరణ) ఆమోదం-దిశా చట్టంగా నామకరణం-సోషల్ మీడియాలో మహిళలను కించ పరుస్తూ పోస్ట్ చేసిన వారికి (ఐపిసి 354-E కింద) రెండేళ్ల జైలు, అదే తిరిగి పునరావృతం అయితే నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష.
2. ప్రభుత్వం లో కొత్తగా ప్రజా రవాణా శాఖ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, ప్రజా రవాణా శాఖ కింద చేర్చుతూ కేబినెట్ ఆమోదం
3. కాపు ఉద్యమం సందర్భంగా పెట్టిన అన్ని కేసులు ఎత్తివేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. తుని ఘటన సహా అన్ని కేసులు రద్దు చేయాలని, తుని ఘటనలో పెట్టిన కేసుల రద్దు కోసం కేంద్రానికి సిఫారసు చేయాలని నిర్ణయం.
4. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి చేస్తూ కేబినెట్ నిర్ణయం.5. రూ.3వేల కోట్ల రుణం తీసుకునేందుకు పౌరసరఫరాలశాఖకు అనుమతి.
6. భోగాపురం విమానాశ్రయం భూసేకరణ సమయంలో పెట్టిన కేసులు ఎత్తివేస్తూ నిర్ణయం.
Note : ఉద్యోగులకు D.A గురించి ఏ విధమైన సమాచారం లేదు