Wednesday, December 4, 2019

One nation one card from june



Read also:

వచ్చే జూన్ నుంచి 'ఒక దేశం-ఒకే రేషన్ కార్డు

జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం అర్హులైన లబ్ధిదారులు దేశంలో ఎక్కడైనా ఆహార ధాన్యాలను పొందేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది. దీనికోసం 'ఒక దేశం-ఒకే రేషన్ కార్డు' పథకాన్ని 2020 జూన్ 1 నుంచి అమలు చేయబోతోంది.

కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మంగళవారం లోక్‌సభకు తెలిపిన వివరాల ప్రకారం... ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత అర్హులైన లబ్ధిదారులు తమ రేషన్ కార్డును ఉపయోగించి, తమకు అర్హతగల ఆహార ధాన్యాలను దేశంలోని ఏ ప్రాంతంలోని చౌక ధరల దుకాణం నుంచి అయినా పొందవచ్చు.
ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళేవారికి ఇబ్బంది లేకుండా ఆహార ధాన్యాలు అందుబాటులో ఉంచడం కోసం 'ఒక దేశం-ఒకే రేషన్ కార్డు' పథకాన్ని రూపొందించారు.ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ ద్వారా లబ్ధిదారు బయోమెట్రిక్/ఆధార్‌ను ధ్రువీకరించిన తర్వాత ఈ పథకం అందుబాటులోకి వస్తుంది. పూర్తి స్థాయిలో ఈపీఓఎస్ పరికరాలు ఉన్న చౌక ధరల దుకాణాల్లో మాత్రమే ఈ పథకం అమలవుతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :