Read also:
Three capitals-సీఎం జగన్ కీలక ప్రకటన. ఏపీకి 3 రాజధానులు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై చర్చలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ కీలక ప్రకటన చేసారు. ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానులు అవసరం ఉందని ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. లెజిస్లేటివ్, జ్యుడిషియల్, ఎగ్జిక్యూటివ్ రాజధానులు ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సౌత్ ఆఫరికా లాంటి దేశాలకు మూడు రాజధానులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ కి కూడా కావాలని ఆయన వ్యాఖ్యానించారు.
త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటాం అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సౌత్ ఆఫ్రికా మోడల్ అన్నారు. అమరావతిలో చట్ట సభలు, విశాఖలో లెజిస్లేటివ్, కర్నూలులో. జ్యుడిషియల్ రాజధాని ఉండే అవకాశం ఉందని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని జగన్ వ్యాఖ్యానించారు.నిపుణుల కమిటి నివేదిక వారంలో వస్తుందని. అప్పుడు దీనిపై నిర్ణయం ప్రకటిస్తామని జగన్ వ్యాఖ్యానించారు.