Monday, November 25, 2019

water bells in ap schools



Read also:

water-bells
  • విద్యారంగంలో సంస్కరణలకు పెద్దపీట వేస్తున్న ఏపీ ప్రభుత్వం. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కొన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ప్రతి శనివారం నో బ్యాగ్‌ డేగా ప్రకటించారు. ఇప్పుడు వాటర్‌ బెల్‌ను తీసుకొస్తున్నారు.
  • స్కూళ్లలో పిల్లలు సరిపడ నీరు తీసుకోకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని మెడికల్‌ రిపోర్టు వెల్లడించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వాటర్‌ బెల్‌ను తీసుకొస్తోంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలను జారీ చేసింది.
  • స్కూళ్లలో పిల్లలు నీరు తాగకపోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, జీర్ణ సమస్యలు ఎదురవుతున్నాయి. సరైన బాత్‌రూములు లేకపోవడం వల్ల కూడా పిల్లలు ఎక్కువగా నీరు తాగడం లేదు.
  • ప్రస్తుతం ఈ అంశంపై దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వం స్కూళ్లలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో వాటర్‌ బెల్‌ ఆదేశాలు ఇచ్చారు. మధ్యమధ్యలో వాటర్‌ బెల్‌ ద్వారా గుర్తు చేసి పిల్లలకు నీరు తాగించడం ఈ ఆలోచన ఉద్దేశం.
  • ఇప్పటికే కేరళ, తెలంగాణలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. విద్యార్థుల వయసును బట్టి రోజుకు మూడు లీటర్ల వరకు నీరు తాగేలా చూడాలని టీచర్లకు సూచనలు ఇస్తున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :