Read also:
కస్టమర్లను ఆకట్టుకునేందుకు జియో కొత్త ఆఫర్ను ప్రవేశపెట్టింది. 189 రూపాయలకే 84 రోజుల వ్యాలిడిటీతో కొత్త ఆఫర్ ను అందిస్తోంది. ఈ ఆఫర్ కోసం ఆన్లైన్ వాలెట్ పేటీఎంతో జియో భాగస్వామ్యం కలిగి ఉంది. 399 ఆఫర్ రీఛార్జి చేస్తే 10 నుంచి 210 వరకు క్యాష్బ్యాక్ ఇస్తున్నారు.
ఈ ఆఫర్ పొందాలంటే జియో వినియోగదారులు పేటీఎం ద్వారా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మీకు పేటీఎం వ్యాలెట్ లో 10 నుంచి 210 క్యాష్బ్యాక్ ఇవ్వబడుతుంది. ఈ అమౌంట్ ను మీరు తదుపరి రీఛార్జ్లో ఉపయోగించవచ్చు. లేదా మీరు షాపింగ్ చేసినప్పుడు పేటీఎం ద్వారా బిల్ చెల్లించేందుకు ఉపయోగించవచ్చు. ఈ విధంగా 399 84 రోజుల ప్లాన్ మీకు 189 రూపాయలకే వస్తుంది. ఇందులో జియో నుండి జియో వరకు 84 రోజుల ఉచిత కాల్స్, 1.5 జిబి ఉచిత డేటా, ఉచిత ఎస్ఎంఎస్ కూడా ఈ ఆఫర్ ద్వారా లభిస్తాయి.