Read also:
రాష్ట్రంలో వివిధ గ్రామ పంచాయతీలను విభజన లేదా పునర్ఃవ్యవస్థీకరించేందుకు ఉన్న నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. చాలా గ్రామ పంచాయతీలను నగర పంచాయతీలు లేదా మున్సిపాలిటీలుగా మార్చేందుకు ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు ఉన్నాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో పంచాయతీల విభజన, పునర్ఃవిభజనపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ సోమవారం ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో మున్సిపాలిటీల్లో, నగర పాలక సంస్థల్లో కొన్ని పంచాయతీలను విలీనం చేసే ప్రక్రియకు దాదాపు అడ్డంకులు తొలగినట్లే. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి.