Thursday, November 28, 2019

Another inspiration story about chittoor teacher



Read also:

మేడమ్‌ మమ్మల్ని వదిలి వెళ్లొద్దంటూ పిల్లలంతా కన్నీటి పర్యంతమయ్యారు. చివరకు చెప్పలేనంత బాధతోనే ఆమెకు వీడ్కోలు పలికారు.శాంతిపురం మండలం సి.బండపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితురాలిగా టి.వేదవతి మూడేళ్ల క్రితం చేరారు. తనదైన శైలిలో పాఠ్యాంశాలు బోధిస్తూ విద్యార్థులకు చేరువయ్యారు. అంతేకాకుండా పాఠశాలకు రూ.6 లక్షలతో తరగతి గదిని నిర్మించారు.పేద విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు కొనివ్వడంతో పాటు అర్థికసహాయం చేసేవారు. మంగళవారం జరిగిన బదిలీల్లో ఆమె పదోన్నతిపై విజయపురం మండలానికి బదిలీ అయ్యారు.రిలీవయ్యేందుకు బుధవారం సి.బండపల్లె పాఠశాలకు చేరుకొన్నారు.ఈ విషయం తెలుకొన్న విద్యార్థులు అమె వద్దకు వెళ్ళి వెళ్ళొద్దు మేడం అంటూ కంటతడి పెట్టారు.వారి బాధ చూసి వేదవతి కూడా కన్నీరు పెట్టారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :