Read also:
వీరికి మాత్రమే అమ్మఒడి.రూల్స్ తెలుసుకోండి
కొత్త రూల్స్ ప్రకారం.ఒకటవ తరగతి నుంచి 12 తరగతి వరకు చదివే పిల్లల తల్లులకు, సంరక్షకులకు ఈ పధకం వర్తింపచేశారు. ఈ పథకం అందుకోవాలంటే. పిల్లలకు ఆధార్ కార్డు ఉండాలి. తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ఒకవేళ పేదరికం పరంగా అర్హత ఉన్నప్పటికీ రేషన్ కార్డు లేకపోయినా దరఖాస్తు అర్జీ ఉంటే లబ్దిదారులుగా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.జనవరి లో బ్యాంకు ఖాతాలకు ఈ నిధుల జమ అయ్యేలా కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.ప్రైవేటు స్కూళ్లలో చదివే వారికి అమ్మఒడి పథకం వర్తించదని గతంలో ప్రచారం జరిగిందికానీ అది నిజం కాదు.
Guidelines
- పిల్లలు ఏ స్కూల్ లో చదువుతున్నారన్నది విషయం కాదు.వారికి తెల్ల రేషన్ కార్డు ఉందా లేదా అన్నదే అర్హతను నిర్ణయిస్తుంది. తాజా కేబినెట్ సమావేశంలో అమ్మఒడి పథకానికి 6450 కోట్ల రూపాయల నిధుల్ని విడుదల చేసేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదాన్ని తెలియ చేసింది.
- నవరత్నాల్లో భాగంగా జగన్ సర్కారు అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకాల్లో అమ్మఒడి ఒకటనే సంగతి తెలిసిందే.
- ఈ పథకం కింద బడికెళ్లే పిల్లలున్న తల్లికి ఆర్థిక సాయంగా ఏడాదికి రూ.15 వేలు అందజేయనున్నారు.
- ఈ పథకం విధివిధానాలను ఏపీ కేబినెట్ ఇటీవలే నిర్ణయించింది.
- ఈ పథకానికి రూ.6450 కోట్ల నిధుల్ని విడుదల చేసేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
- ఒకటో తరగతి నుంచి 12 తరగతి వరకు చదివే పిల్లల తల్లులకు, సంరక్షకులకు ఈ పథకం వర్తిస్తుంది.
- అర్హత ఉండి రేషన్ కార్డు లేకపోయినా.. కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే లబ్ధిదారులుగా పరిగణనలోకి తీసుకోవాలని మంత్రివర్గం తీర్మానించింది.
- జనవరిలో బ్యాంకు ఖాతాల్లో ఈ నిధులు జమ అవుతాయి.
- అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే.. పిల్లలు ఒకటి నుంచి 12 తరగతి మధ్య చదువుతుండాలి. ఉండాలి.
- తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలి. తెల్ల రేషన్ కార్డు లేకపోయినప్పటికీ.. కార్డు కోసం దరఖాస్తు చేసి ఉండాలి.
- ప్రైవేటు స్కూళ్లలో చదివే వారికి సైతం ఈ పథకం వర్తిస్తుంది.
- అమ్మఒడి దరఖాస్తు ఫారం కూడా అందుబాటులోకి వచ్చింది.
- అర్హులైన వారు వివరాలతో గ్రామ వాలంటీర్ను సంప్రదించాలి.
- అర్హత వివరాలను పూర్తిగా తెలుసుకోవడం కోసం గ్రామ సచివాలయాన్ని సైతం సంప్రదించొచ్చు.
- అమ్మఒడి పథకం వర్తించాలంటే ఒకటో తరగతి నుంచి ఇంటరు వరకు చదువుతున్న విద్యార్థులకు డిసెంబరు 31 నాటికి 75 శాతం హాజరుండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల వారీగా ఉపాధ్యాయులు హాజరు నివేదికలను తయారు చేయాలని సూచించారు.