Read also:
Unknown facts about deposit bhema
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.బ్యాంకు సంస్థల్లో కొత్త కొత్త రూల్స్ని తీసుకొస్తుంది. అంటే.ప్రస్తుతం ఒక వ్యక్తి బ్యాంక్ ఖాతాలో.డిపాజిట్ రూపేణా ఎంత ఉన్నా. లక్ష రూపాయల వరకే బీమా వర్తిస్తుందని తెలిపింది. అంటే.అనుకోని మీరు డిపాజిట్ చేసిన బ్యాంక్.దివాలా తీసినా.మూసివేసినా.మీకు ముట్టేది మాత్రం లక్షనే అన్నమాట. అయితే.పీఎంసీ బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో.బీమా వర్తించే మొత్తాన్ని సత్వరం గణనీయంగా పెంచాలని ఎస్బీఐ నివేదిక అభిప్రాయ పడింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత వారం పంజాబ్ మరియు మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్ (పీఎంసీ)పై పలు రకాల నిబంధనలు పెట్టింది. రోజుకు వెయ్యి విత్ డ్రా అనే నియామాలు పెట్టింది.
దీనికి కారణం అదేనని అర్థమవుతోంది. గ్లోబల్ మేసేజింగ్ సాఫ్ట్వేర్కు సంబంధించి ఆదేశాలను పాటించని 36 ప్రైవేట్, విదేశీ బ్యాంకులపై ఆర్జీఐ కొరడా ఝలిపించింది. స్విఫ్ట్ కార్యక్రమాల్లో ఆశించినంత వృద్ధి చూపని కారణంగా 71 కోట్ల జరిమానా విధించింది.కాగా.పంజాబ్ నేషన్ బ్యాంక్లో 14వేల కోట్ల స్కామ్ జరగడానికి కారణం స్విఫ్ట్ దుర్వినియోగం చేయడమేనని గుర్తించింది ఆర్బీఐ. ఆ క్రమంలో స్విఫ్ట్ బలోపేతం చేయాలని పలు బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. వాటి లక్ష్యపెట్టలేదనే కారణంతో జరిమానా నిర్ణయం తీసుకుంది.
అసలేం జరిగింది: పంజాబ్ (పీఎంసీ)పై ఆరు నెలలపాటు షరతులు వర్తింప చేస్తూ.. ఆర్బీఐ గత నెలలో ఆదేశాలిచ్చింది. దివాలా తీసినా.. మూసినా.. ఇచ్చిన రుణాలు నిరర్థక ఆస్తులుగా మారినా వెల్లడించకపోవడం వంటి తీవ్రమైన చర్యలకు ఆ బ్యాంక్ నిర్వాహకులు పాల్పాడ్డారు. దీంతో.. ఆ బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. కొత్త రూల్స్ని పెట్టింది. మొదట ఓన్లీ వెయ్యి మాత్రమే విత్డ్రా చేయాలని చెప్పింది. ఆ తరువాత దాన్ని రూ.25 వేలు చేసింది. అలాగే.. ఎవరైనా కొత్త రుణాలు తీసుకోవాలన్నా.. డిపాజిట్ చేయాలన్నా నిషేధం విధించారు.
ప్రస్తుతం బీమా ఇలావుంది
ప్రస్తుతం బ్యాంక్ ఇన్సూరెన్స్పై ఆర్టీఐ కొత్త రూల్స్ని పాస్ చేసింది. అవేంటంటే..!
1. అసలు వడ్డీకి లక్ష రూపాయల బీమాకు క్రెడిట్ గ్యారెంటీ అందజేస్తోంది.
2. బ్యాంక్ లిక్విడేషన్ లేదా.. రద్దయ్యే తేదీకి నాటికి ఉన్న మొత్తంపై బీమీ వర్తింపజేస్తుంది.
3.బ్యాంకులో లక్ష లోపు ఉన్నా.. ఆపై ఉన్న సొమ్ముకు కూడా రూ. లక్షనే బీమా అమలు అవుతుంది. మిగతా వివరాల కోసం పక్కన ఉన్న లింక్ను లాగిన్ అవ్వండి
ఒకే బ్యాంకులో చాలా ఖాతాలుంటే?
ఒకే బ్యాంకులో చాలా ఖాతాలున్నా కూడా ఇదే పద్దని అవలంభించాలని ఎస్బీఐ బ్యాంక్ అభిప్రాయ పడింది. పలు సూచనలు జారీ చేసింది. వ్యక్తిగత డిపాజిటర్ వద్ద ఉన్న అన్ని ఖాతాలలో లక్షనే బీమా పరిమితి వర్తిస్తుంది. కాబట్టి, మీరు ఒకే బ్యాంకులో ఎక్కువ ఖాతాలున్నా మీరు బీమా చెల్లింపుగా ఒక లక్ష మాత్రమే అందుకుంటారు. అలాగే.. ఇది ఉమ్మడి ఖాతాలకు కూడా.. ఒకే లక్షను ఇన్సూరెన్స్గా అందుకుంటారు.