Friday, October 18, 2019

Text-books will cahnge from 1st to 5th class



Read also:

1 నుంచి 5వ తరగతి వరకూ  పాఠ్య పుస్తకాలు మారబోవుచున్నాయి.

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యలో సంస్కరణలు రానున్నాయి. ఇందులో భాగంగా 1 నుంచి 5వ తరగతి వరకూ పాఠ్య పుస్తకాలు మారబోవుచున్నాయి. నూతన విద్యా విధానం - 2019 ప్రకారం ఈ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇందులో భాగంగా ' అకడమిక్ సలహా బోర్డు పుస్తకాల మార్పుపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది . తరగతుల వారీగా సబ్జెక్టులు వారీగా  పాఠ్యాంశాల మార్పుల పై ఈ కమిటీ నివేదించింది. ఇందులో భాగంగా ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సదస్సులు ఏర్పాటు చేస్తారు. ఒకేసారి 1 - 5 తరగతులు కాకుండా ఒక సారి 1 , 3 , 5 , ఆ తర్వాత 2 , 4 తరగతుల పాఠ్య పుస్తకాలను మార్చనున్నట్లు తెలుస్తున్నది . రాష్ట్రవ్యాప్తంగా 1 నుంచి 8వ తరగతి వరకూ అన్ని ప్రభుత్వ బడుల్లో వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం పై అకడమిక్ సలహా బోర్డు సభ్యులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు . 1 నుంచి 3 తరగతుల వరకు తెలుగు మాధ్యమం కొనసాగించి , 4 . 5 తరగతులకు వచ్చేసరికి ఆప్షనల్ సబ్జెక్టులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్పు చేయాలని కొందరు సభ్యులు సూచించారు .

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :