Read also:
పేరెంట్స్ కమిటీ ఎన్నికలు ఇంత వరకు జరగని పాఠశాలలకు మరల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు
జిల్లాలో గల ప్రభుత్వ పాఠశాలలకు తే . 23 . 09 . 2019దిన తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు నిర్వహించడమైనది . అయితే కొన్ని పాఠశాలలో కోరం లేకపోవడం వలన వివాదాల వలన పాఠశాలలకు తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు నిర్వహించబడలేదు . తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు నిర్వహించని పాఠశాలలో మరల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు నిర్వహించమని ప్రభుత్వము ఆదేశాలు జారీచేసియున్నది . ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు నిర్వహించని పాఠశాలలో సత్వరమే తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు నిర్వహించుటకు చర్యలు తీసుకోవలసినదిగా కోరడమైనది . సదరు తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు నిర్వహణకు మండలంలో గల మండల అధికారులు , పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు సహాయ సహకారాలు తీసుకోవలసినదిగా సూచించడమైనది . మరియు తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు నిర్వహించిన పాఠశాలల డేటాను తక్షణమే STMS App లో upload చేయవలసినదిగా కోరడమైనది .