Read also:
విద్యాభివృద్ధికి ఏపీ సీఎం కీలక నిర్ణయాలు
- విద్యారంగంలో సంస్కరణలపై ఏర్పాటైన కమిటీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహణ.
- పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యపై కమిటీ సిఫార్సులపై చర్చ.
- రూ.5 కోట్ల ఖర్చుతో 1200 మంది టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి వ్యాఖ్య. ‘వచ్చే ఏడాది 1 నుంచి 8వ తరగతి వరకూ ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతున్నాం.
- విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు ఉండేలా చూడాలి. టీచర్లకు సరైన శిక్షణ ఇవ్వాలి. 45 వేల స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నాం.
- స్కూళ్లలో ప్రారంభించిన నాడు –నేడు కార్యక్రమం కొనసాగాలి. పిల్లలకోసం ఏర్పాటు చేసే ఫర్నీచర్ క్వాలిటీ విషయంలో రాజీ పడొద్దు.
- పాఠ్యప్రణాళిక చాలా బలోపేతంగా ఉండాలి’అని సీఎం వెల్లడి.
- ప్రైవేటు స్కూళ్లలో ఉన్న నాణ్యత, ప్రమాణాలను కూడా పరిశీలించాలి. చదువు అనేది కచ్చితంగా ఉపాధి లేక ఉద్యోగం కల్పించాలి.
- విద్యా అనేది వ్యాపారం, డబ్బు కోసం కాదు. ఇది ఒక ఛారిటీ. ప్రభుత్వం విద్యా సంస్థల్లో ఖాలీలను భర్తీ చేయాలి.
- విద్యాశాఖలోని అధికారులు వారధిలా పనిచేయాలి’అని సీఎం వ్యాఖ్యానించారు.