Read also:
సచివాలయ ఉద్యోగుల పరీక్షలకు తమకు ఎటువంటి సంబంధం లేదని ఎపిపిఎస్సి ఛైర్మన్ ఉదరుభాస్కర్ తెలిపారు. స్ధానిక ఎపిపిఎస్సీ కార్యాలయంలో సోమవారం గ్రామ సచివాలయ పరీక్షా పేపర్ల లీకేజీ అంశంపై ఉన్నత స్ధాయి అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ పరీక్షలను పంచాయతీరాజ్శాఖ నిర్వహిం చిందని తెలిపారు. ఎపిపిఎస్సీ సంస్థ రాజ్యాంగ బద్ధమైన సంస్థ అని, తమ పరిధిలోని అన్ని అంశాలు రహస్యంగా ఉంటాయన్నారు. పరీక్షలపై ప్రభుత్వం తమ సంస్థ నివేదిక కోరలేదన్నారు. ఈ సమావేశంలో కార్యదర్శి మౌర్య తదితరులు పాల్గొన్నారు.