Wednesday, September 25, 2019

The best comedian venu madhav died



Read also:


సినీనటుడు వేణుమాధవ్ కన్నుమూత


ప్రముఖ టాలీవుడ్‌ కమేడియన్ వేణుమాధవ్ కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. యశోద హాస్పిటల్‌లో వెంటిలేటర్‌ సాయంతో.. వేణు మాధవ్‌కి చికిత్స అందిస్తున్న వైద్యులు. గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో.. పాటుగా కిడ్నీ సమస్య కూడా తలెత్తడంతో.. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. పలుహిట్ చిత్రాల్లో నటించిన వేణు మాధవ్.. అనతికాలంలోనే మంచి పేరు సంపాదించారు. కమెడియన్స్‌లో తనకంటూ.. ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మిమిక్రీ కళాకారుడిగా కెరీర్‌ను ప్రారంభించిన వేణు మాధవ్.. ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'సంప్రదాయం' చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు.
ఇక సినిమాల విషయానికి వస్తే. మాస్టర్, తొలిప్రేమ, సుస్వాగతం, తమ్ముడు సినిమాలతో హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దశాబ్దన్నర కాలంపాటు హాస్యనటుడిగా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. హంగామా సినిమా ద్వారా వేణుమాధవ్ హీరోగా కూడా మారారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :