Read also:
చంద్రయాన్-2 ప్రయోగం 98 శాతం సక్సెస్.. తదుపరి టార్గెట్ గగన్యాన్
2021లో మానవ సహిత అంతరిక్షయాత్ర:శివన్
డిసెంబర్ 2021 కల్లా మానవ సహిత అంతరిక్ష యాత్ర చేయడమే లక్ష్యంగా దేశం ముందుకెళ్తోందని ఇస్రో ఛైర్మన్ శివన్ శనివారం వెల్లడించారు. చంద్రయాన్-2లోని 'విక్రమ్' అనుకున్న ప్రకారం చంద్రుడి ఉపరితలంపై దిగనప్పటికీ మిషన్ గగన్యాన్పై ఎలాంటి ప్రభావం చూపదని ఆయన అన్నారు. ఐఐటీ భువనేశ్వర్ 8వ స్నాతకోత్సవం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇస్రో ఛైర్మన్ శివన్ పాల్గొని విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. చంద్రయాన్-2 ఆర్బిటర్ ఇంకా ఏడున్నర సంవత్సరాల పాటు సమాచారాన్ని పంపుతుంది, అంతేకాకుండా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ల్యాండింగ్ మినహా అన్ని పక్కాగానే జరిగాయి. అలా అని ఇది విజయం సాధించినట్టు కాదా అని అడిగారు 2021 డిసెంబర్లో తలపెట్టే ఈ గగన్యాన్ ప్రాజెక్టులో తొలి భారతీయ వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని అన్నారు. ఈ ప్రాజెక్టు భారత సాంకేతిక పరిజ్ఞానం సామర్థ్యాన్ని చాటిచెప్పడానికి ఎంతో ముఖ్యమైనదని చెప్పారు. అదేవిధంగా విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ.. ఆవిష్కరణలు చేయాలంటే విద్యార్థులంతా బాగా శ్రమించాలని అన్నారు.
ఎడిసన్ బల్బు కనిపెట్టడానికి ఎన్ని సార్లు విఫలమయ్యాడు. ఇలాంటి వైఫల్యాలు విజయానికి అడ్డంకిగా మారకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఐటీ భువనేశ్వర్ డైరెక్టర్ ఆవీ రాజా కుమార్తో కలిసి 32 మందికి పీహెచ్డీ, 105 మందికి ఎంటెక్, 67 మందికి ఎమ్మెస్సీ, 152 మందికి బీటెక్ డిగ్రీల పట్టాలను అందజేశారు.
భూకేంద్రంతో విక్రమ్కు సంబంధాలు తెగిపోడానికి గల కారణాలను ఇస్రో నిపుణులు శోధిస్తున్నారని, ఈ నివేదిక అనంతరం తదుపరి కార్యాచరణ చేపడతాని వివరించారు. ఇస్రో తదుపరి లక్ష్యం ‘గగన్యాన్ మిషన్’ అని శివన్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇస్రో చేపట్టబోయే మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ‘గగన్యాన్’. దీని ద్వారా 2022 నాటికి వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాలని ఇస్రో లక్ష్యంగా నిర్దేశించుకుంది.
సాయుధ బలగాల్లోని టెస్ట్ పైలట్లను వ్యోమగాములుగా పంపాలని ఇస్రో భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఎంపిక ప్రక్రియ కూడా చేపట్టింది. ముగ్గురిని ఎంపిక చేసి తొలుత భారత్లో, తర్వాత రష్యాలో వీరికి ప్రత్యేక శిక్షణ ఇప్పించనున్నారు. గగన్యాన్ ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపితే.. స్వయంగా మానవులను అంతరిక్షంలోకి పంపిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది. వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపి వారి సురక్షితంగా భూమిపైకి తీసుకురావడం చాలా ముఖ్యం.
విక్రమ్ ల్యాండర్ పక్కకి ఒరిగడం వల్ల సిగ్నళ్లు పోయినట్లు ఇస్రోకి సమాచారం అందింది. మరోవైపు నాసా (NASA) ప్రయోగించిన లూనార్ రీకానిసెన్స్ ఆర్బిటర్ (LRO) సైతం విక్రమ్ ల్యాండర్ దిగిన దక్షిణ దృవం మీదగానే ప్రయాణించింది. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో కొన్ని ఫొటోలను తీసింది. అయితే, ఆ ఫొటోల్లో విక్రమ్ ల్యాండర్ జాడ కనిపించలేదు.
ఆ ప్రాంతంలో సూర్య రశ్మి తక్కువగా ఉండటంతో ఫొటోలు మసక మసకగా కనిపించాయి. చంద్రుడిపై ఒక రోజు అంటే భూమిపై 14 రోజులతో సమానం. చంద్రయాన్-2 ఆర్బిటార్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగి సుమారు 11 రోజులు తర్వాత నాసా ఎల్ఆర్వో ప్రయాణించింది. అప్పటికే ఆ ప్రాంతంలో క్రమేనా చీకటి ఆవరించడం, వెలుతురు సరిగా లేకపోవడంతో విక్రమ్ ల్యాండర్ కనిపించలేదు.