Read also:
Bit paper removed from 10th class public examinations
100 మార్కులకు రాత పరీక్ష
ప్రతీ పేపర్లోనూ 18మార్కులు సాధించాల్సిందే
ప్రభుత్వానికి ప్రతిపాదనలు.
ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో బిట్ పేపర్ను తొలగించనున్నారు. ప్రశ్నపత్రంలోనే బహుళైచ్చిక ప్రశ్నలు ఇవ్వనున్నారు.
- ప్రశ్నపత్రం నమూనా పూర్తిగా మారనుంది. కొత్తగా రూపొందించిన నమూనా ప్రశ్నపత్రాన్ని పాఠశాల విద్యాశాఖ సోమవారం ప్రభుత్వానికి పంపింది.
- దీనిపై ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. గతంలో 20 అంతర్గత మార్కులు ఉండగా వాటిని తొలగించారు.
- దీంతో 100మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. హిందీ మినహా ప్రతి సబ్జెక్టుకు 2 పేపర్లు ఉంటాయి.
- ఇప్పటి వరకు 2 పేపర్లలో కలిపి 35 మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధించినట్లుగా పరిగణిస్తున్నారు.
- కొత్త విధానం ప్రకారం ప్రతి పేపర్లోనూ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ లెక్కన 18 మార్కులు సాధిస్తేనే ఉత్తీర్ణులైనట్లు పరిగణిస్తారు.
- జవాబు రాసే పేపర్లను బుక్లెట్ విధానంలో ఇవ్వాలని నిర్ణయించినా దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
- ప్రశ్నపత్రం నమూనా ఇలా
- అర మార్కు ప్రశ్నలు 12 ఇస్తారు. వీటిని నేరుగా ప్రశ్నపత్రంలోనే ఇస్తారు. వీటిల్లో బహుళైచ్చికాలు, ఖాళీలు, జతపర్చడంలాంటివి ఉంటాయి. జవాబు పత్రంలో సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
- ఒక మార్కు ప్రశ్నలు 8 ఉంటాయి. వాటికి 2, 3 లైన్లలో సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.
- మార్కుల ప్రశ్నలు 8, నాలుగు మార్కులవి 5 ఉంటాయి. మొత్తం 50 మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది.