Read also:
ట్రాఫిక్ చాలాన్లు మరియు వాటి చార్జీల గురించి ప్రజా అవగాహన
భారత మోటార్ వాహన (Amendment ) చట్టం 2019 ప్రకారం కేవలం ₹100 మాత్రమే చెల్లించాలి
భారత మోటార్ వాహన (Amendment ) చట్టం 2019 ప్రకారం కేవలం ₹100 మాత్రమే చెల్లించాలి
అవును?మీరు ఏదైనా ట్రాఫిక్ రుల్ ని అతిక్రమిస్తే, పోలీస్ గాని, RTO సిబ్బంది అడ్డుకుని మీకు చాలన్ రాసి రసీదు ఇస్తే మీరు వెంటనే ఆ డబ్బును చెల్లించనవసరం లేదు. మీకు ఆ డబ్బు చెల్లించడానికి 15 రోజుల సమయం వుంటుంది, ఈ 15 రోజుల సమయం లో మీరు ఏ రుల్ ని అతిక్రమిస్తే మీకు చాలాన్ విధించారో (ఊదా : మీకు లైసెన్స్ లేదని ₹10000 చలాన్ రాసి రసీదు ఇస్తే ) మీరు ఆ రసీదు తో పాటు మీరు ఆ సమయంలో చూపించ లేని లైసెన్స్ మరే ఇతరత్రా పత్రాలను తీసుకెళ్ళి సంబధిత అధికారికి, లేదా పోలీస్ స్టేషన్లో చూపించిన యెడల మీకు ఆ చాలాన్ యొక్క ₹ 10000 మాఫీ చేసి కేవలం ₹100 (అవును వందే) మాత్రమే చెల్లించుకుంటారు. అది 4 రూల్స్ అతిక్రమిస్తే 4 పెనాల్తీలు వేసినా అంతా మాఫీ చేసి కేవలం ₹100 చెల్లించుకుంటారు. ఏ అధికారికి వాహనాన్ని on the spot సీజ్ చేసే అధికారం లేదు, వాహనం స్టేషన్ కు తీసుకెళ్లే అధికారం కూడా లేదు. అసలు చట్టం ఇదే.
15 రోజుల తరువాత మీరు సంబంధిత పత్రాలు చూపించని యెడల చాలాన యొక్క మొత్తం డబ్బు కట్టవలసి వుంటుంది.
పోలీస్ లు RTO అధికారులు, ప్రజలు కూడా అవగాహన లేక వేలకు వెలు పెనాల్టీ లతో వాహనాలు వదిలేసి, అక్కడే తగలబెట్టి, ధ్వంసం చేసి వెళ్ళడం చూసాం.