Read also:
ఈ థైరాయిడ్ వ్యాధి నందు రెండు రకాలు కలవు. అవి .
*వీరు ఆహరంలో ఎక్కువుగా క్యాబేజి , చిక్కుడు , సోయాబీన్స్ , వేరుశనగ వాడాలి. ముల్లంగి కూడా వాడవచ్చు .
*విటమిన్ - C , E , B2 , B6 , జింక్ , నియాసిన్ లు థైరాయిడ్ గ్రంథికి శక్తిని ఇస్తాయి . ఇవి టమాటా , నారింజ , ఉసిరి వంటి పండ్లలో ఎక్కువుగా ఉండును.
*మెడకు సంబంధించిన వ్యాయామం చేయాలి . ధ్యాన సాధన చేయడం మంచిది .
*రోజుకి 30 నిమిషాలపాటు వ్యాయామం చేయుట మంచిది . సర్వాంగాసనం , హలాసనం , మత్స్యసనం , భుజంగాసనం , ధనురాసనం వేయడం మంచిది .
మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.
- హైపో థైరాయిడిజం.
- హైపర్ థైరాయిడిజం.
ముందుగా మీకు హైపో థైరాయిడిజం గురించి వివరిస్తాను.
హైపో థైరాయిడ్- థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి తక్కువుగా ఉండటం వలన హైపొ థైరాయిడ్ వస్తుంది. ఇది T3 ( Tridothyronine) , T4 (Thyroxine) ను థైరాయిడ్ గ్రంథి తక్కువుగా స్రవించడం మూలాన ఈ సమస్య వచ్చును.
లక్షణాలు
- వీరి చర్మం పొడిగా ఉంటుంది. ముఖం ఉబ్బుగా , గుండ్రంగా అవుతుంది. త్వరగా అలిసిపోవడం బలహీనంగా ఉండి చలికి తట్టుకోలేరు.
- చెమట తక్కువుగా వస్తుంది. జుట్టు ఎక్కువుగా రాలిపోతుంది. మానసికపరమైన ఆందోళన ఎక్కువుగా ఉండును.
- గుండె పెరుగుతుంది . గొంతులో మార్పు వస్తుంది. కళ్ల కింద ఉబ్బుగా ఉంటుంది. మాటల స్పష్టత తగ్గును. కండరాల శక్తి క్షీణిస్తుంది. మలబద్దకం , పొట్ట ఉబ్బుగా ఉండును. రక్తహీనత కలిగి ఉండి దేనిమీద ఆసక్తి లేకపోవటం , కోపం , చిరాకు , విసుగు ఎక్కువుగా ఉండును. జుట్టు రంగు తగ్గును. శరీరం ఉదయం ఒకలాగా సాయంత్రం ఒకరకంగా ఉండును.
- ఈ సమస్య ఎక్కువుగా స్త్రీలలో కనిపిస్తుంది. 30 నుంచి 40 సంవత్సరాల మధ్యవయస్సు ఉన్నవారికి వస్తుంది. ఉదయం పూట వదులుగా ఉన్న జాకెట్లు సాయంత్రం అయ్యేసరికి బిగుతుగా అగును. బరువు పెరుగుతారు.
- మలబద్దకం ఎక్కువుగా ఉండును. ఋతువు సరైన సమయానికి రాదు . ఋతు సమయంలో కడుపులో నొప్పి ఉండును.
- కండరాలు మరియు జాయింట్ నొప్పులు అధికంగా ఉండును. భుజాలు , చేతులు , కాళ్లు నొప్పి ఎక్కువుగా ఉండును.
- శరీరం నందు బద్ధకం ఎక్కువుగా ఉండును. ఎక్కువుగా జలుబు చేయును .
- చేతి మరియు కాలు వేళ్ళ గోళ్లు పగుళ్లు రావచ్చును. సీరం సోడియం తక్కువుగా ఉండును. రక్తహీనత ఉండును.
- లివర్ ఎంజైమ్స్ ఎక్కువుగా ఉండును. శరీర ఉష్ణోగ్రత తక్కువుగా ఉండును. గుండెవేగం తక్కువుగా ఉండును. రక్తపోటు తక్కువుగా ఉండును.
- హైపో థైరాయిడిజం ఉన్నప్పుడు క్యాబేజి , సోయాబీన్స్ , వేరుశనగ , మొక్కజొన్న , బఠాణి , ముల్లంగి మెదలైనవి వాడకూడదు.
- విటమిన్ - C , విటమిన్ - E , విటమిన్ - B2 , జింక్ , నియాసిన్ , B3 , B6 మరియు టైరోసిన్ ఉన్న ఆహారపదార్ధాలు వాడాలి. ఇది థైరాయిడ్ హార్మోన్ పనితీరును మెరుగుపరుస్తాయి. ఉల్లిపాయ ను కూడా బాగా తీసుకోవాలి .
- థైరాయిడ్ బాగా పనిచేయాలి అంటే ముఖ్యంగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు ఎక్కువుగా తీసుకోవాలి . పసుపుపచ్చ రంగులో ఉండే పండ్లు ఎక్కువుగా తీసుకోవాలి . డ్రై ఫ్రూట్స్ , పచ్చికొబ్బరి తినవలెను .
లక్షణాలు
- రోజురోజుకి బరువు తగ్గుట.
- గుండె వేగం పెరగటం .
- చెమట ఎక్కువుగా పట్టడం .
- వేడి వాతావరణాన్ని భరించలేకపోవడం .
- ఆకలి ఎక్కువుగా ఉంటుంది.
- వికారంగా ఉండును.
- మలబద్దకం లేదా విరేచనాలు , అతిమూత్రం , నీరసం , అలసట ఉంటుంది.
- మతిమరుపు , దుఃఖం , శరీరం వేడిగా ఉంటుంది. జుట్టురాలడం , నిద్ర సరిగా లేకపోవటం వంటి లక్షణాలు కనపడును.
- దేని మీద శ్రద్ధ లేకపోవటం , అసహనంగా ఉండటం , కోపంతో కేకలేయడం , చేతులు వణుకుతుంటాయి .
పాటించాల్సిన నియమాలు
*వీరు ఆహరంలో ఎక్కువుగా క్యాబేజి , చిక్కుడు , సోయాబీన్స్ , వేరుశనగ వాడాలి. ముల్లంగి కూడా వాడవచ్చు .
*విటమిన్ - C , E , B2 , B6 , జింక్ , నియాసిన్ లు థైరాయిడ్ గ్రంథికి శక్తిని ఇస్తాయి . ఇవి టమాటా , నారింజ , ఉసిరి వంటి పండ్లలో ఎక్కువుగా ఉండును.
*మెడకు సంబంధించిన వ్యాయామం చేయాలి . ధ్యాన సాధన చేయడం మంచిది .
*రోజుకి 30 నిమిషాలపాటు వ్యాయామం చేయుట మంచిది . సర్వాంగాసనం , హలాసనం , మత్స్యసనం , భుజంగాసనం , ధనురాసనం వేయడం మంచిది .
కొన్ని ప్రాంతాలలో ఆహారం , నీటిలో అయొడిన్ లవణం తక్కువుగా ఉండటం వలన "గాయిటర్" అనే వ్యాధి వస్తుంది. గాయిటర్ వ్యాధి ఉన్నవారిలో మీద ముందు థైరాయిడ్ గ్రంథి కణిత వలే పెద్దగా కనపడును. అయోడిన్ లవణం అధికంగా తీసుకోవడం వలన పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు . సహజ ఆహారపదార్దాల ద్వారానే దీనిని పొందడం ఉత్తమం . అయొడిన్ ప్రతిరోజు పెద్దవారు 150 మి.గ్రా , గర్భిణి స్త్రీలు 175 మి.గ్రా తీసికొనవలెను . ఇది ముఖ్యంగా కూరగాయలలో అధికంగా ఉండును.
ఆయుర్వేదం నందు దీనిని "గళగండ " వ్యాధిగా పిలుస్తారు . ఆయుర్వేదం నందు అత్యద్భుతమైన మరియు సంపూర్ణంగా వ్యాధిని నివారించు ఔషధాలు కలవు.
గమనిక
నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.
మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.
రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి ,రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం,ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి.ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.
ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. కొరియర్ చార్జీలు కూడ ఇందులోనే పైన మీరు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు . పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.
ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు ,9885030034 ,అనువంశిక ఆయుర్వేద వైద్యులు .
ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు ,9885030034 ,అనువంశిక ఆయుర్వేద వైద్యులు .