Read also:
ఇక నుంచి కరెంటు పోతే , మీ చేతికి డబ్బులు గ్రామాలలో ఎడాపెడా కరెంట్ కోతలు విధిస్తుంటారు . వేసవిలో అయితే ఒకోసారి ఎప్పుడు కరెంటు వస్తుందో , ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంటుంది , ఇక వర్షాకాలంలో కూడా ఈదురు గాలుల దెబ్బకు కరెంటు పోతే ఒక్కోసారి 24 గంటలు రాని సంఘటనలు ఎన్నో ఉన్నాయి . అందులో భాగంగా ఒక్కోసారి ప్రమాదాలను అరికట్టేందుకు ముందుగానే విద్యుత్ శాఖ కరెంటు ను నిలిపివేసి ఈదురు గాలులతో కూడిన వర్షం తగ్గిన తరువాత కరెంటు పునరుద్ధరిస్తారు .
కానీ ఇక నుంచి అలా వారికి ఇష్టమైనప్పుడు కరెంటు తీసివేయడానికి కుదరదని తెలుస్తుంది . త్వరలో కేంద్రం తీసుకోబోయే సంచలనాత్మకమైన నిర్ణయంతో ముందస్తు సమాచారం లేకుండా కరెంటు తీసివేస్తే విద్యుత్ సంస్థలకు బారి జరిమాన వేయనున్నారట . ఈ డబ్బును నేరుగా వినియోగదారుడి ఖాతాకే జమ చేయనున్నారట . ఎప్పుడు పడితే అప్పుడు పవర్ కట్స్ తో వినియోగదారుడిని ఇబ్బంది కలిగించకుండా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది . కాకపోతే విపత్తులు , సాంకేతిక సమస్యలు వచ్చిన సమయంలో ముందస్తు సమాచారంతో విద్యుత్ నిలిపివేస్తే జరిమానా ఉండదని తెలుస్తుంది . కేంద్రం తీసుకున్న నిర్ణయంతో భారతదేశంలో ఒక పటిష్టమైన ప్రణాళికతో ప్రతి ఇంటిలో దీపం వెలగటమే కాకుండా ఎలాంటి ఇబ్బందులకు వినియోగదారుడు ఎదుర్కోకుండా తీసుకోవాలని నిర్ణయించడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు