Monday, August 26, 2019

వెయ్యి కోట్ల పెట్టుబడి . . . 1500 ఉద్యోగాలు



Read also:

హైదరాబాద్లో మరో ప్రతిష్టాత్మక సంస్థ ప్రీమియం మొబైల్ ఫోన్ల కంపెనీ వన్ ప్లస్ మొబైల్స్ హైదరాబాద్లో వన్ ప్లస్ మొబైల్స్ ఆర్ అండ్ డీ సెంటర్ ను ఏర్పాటు చేసింది . టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , వన్ ప్లస్ వ్యవస్థాపకుడు పీట్ లూ , కంపెనీ ప్రతినిధులు ఈ సందర్భంగా పాల్గొన్నారు . సెంటర్ ను ప్రారంభించిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వన్ ప్లస్ ఆర్ అండ్ డీ కోసం వన్ ప్లస్ సంస్థ రూ . వెయ్యికోట్లు పెట్టుబడి పెట్టడం మంచి పరిణామమన్నారు . రెండేళ్లలో 1500 మంది ఉద్యోగులు ఇందులో పనిచేయనున్నారని కేటీఆర్ తెలిపారు . తయారీ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని కోరుతున్నానని ఆయన పేర్కొన్నారు . 2018లో కంపెనీకి భారీ రెవెన్యూ రావడంతో . . వన్ ప్లస్ కంపెనీ . . ప్రత్యేకించి ఇండియానే తమ మార్కెట్ విస్తరణలో ఒక భాగంగా ఎంచుకుంది .
R&D-center
ఏడాదిలో మేము . . మూడు కొత్త ఎక్స్ పీరియన్స్ స్టోర్లను ఓపెన్ చేయబోతున్నామని ప్రకటించింది . పుణెలో ఒక ఎక్స్ పీరియన్స్ స్టోర్ ఓపెన్ చేస్తాం . హైదరాబాద్ లో ఓపెన్ చేయబోయే వన్ ప్లస్ స్టోర్ ( 16వేల చదరపు అడుగులు ) ప్రపంచంలోనే అతిపెద్దది ' అని వన్ ప్లస్ వివరించింది . ఇదిలాఉండగా , త్వరలో వన్ ప్లస్ టీవీ విడుదల కానుంది . చాలా రోజుల నిరీక్షణ తరువాత వన్ ప్లస్ టీవీకి సంబంధించిన సమాచారాన్ని సంస్థ వెల్లడించింది . సెప్టెంబర్ లో ఈ టీవీ లాంచ్ చేసే అవకాశమున్నట్టు సమాచారం . ఆ టీవీకి సంబంధించి ఫీచర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . 1080 రిజల్యూషన్ తో మాత్రమే పనిచేసే ఈ టీవీ స్క్రీన్ , 4కేకి కూడా అనువుగా ఉంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి . క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ5670 చిప్ సెట్ తో పనిచేస్తుందని చెబుతున్నారు . మాలి - జీ51 ఎంపీ3 జీపీయూతో వచ్చే ఈ టీవీకి 3జీబీ ర్యాం ఉంటుందంటున్నారు . ఇదిలాఉండగా , ఇటీవలే వన్ ప్లస్ 7 , 7 ప్రొ లను విడుదల ఒకేసారి విడుదల చేశారు . బెంగళూరు , లండన్ , న్యూయార్క్ లలో ఒకే సారి ప్రాడక్ట్ ను పరిచయం చేస్తూ ఈవెంట్ ను నిర్వహించింది . ఎస్ బీఐ క్రెడిట్ డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 2వేల రూపాయల ఇన్స్టంట్ డిస్కౌంట్ ఇస్తోంది .

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :