Read also:
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకు మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి మహాలక్ష్మమ్మ (73) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొద్దిరోజులుగా ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించి మరణించారు. మహాలక్ష్మమ్మకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. మగ సంతానంలో రెండో కుమారుడు మంత్రి శ్రీనివాసరావు. ఆమె మతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. సోమవారం ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.