Thursday, August 29, 2019

అక్టోబర్ 2 నుంచీ బ్యాన్ అయ్యే ప్లాస్టిక్ ఉత్పత్తులు ఇవే



Read also:

 ప్లాస్టిక్ బ్యాగులు , కప్పులు , ప్లేట్లు , చిన్న బాటిల్స్ , స్టాలు , శాషేల వంటి ఆరు రకాల ప్లాస్టిక్ ఉత్పత్తుల్ని అక్టోబర్ 2 నుంచీ కేంద్ర ప్రభుత్వం నిషేధించబోతున్నట్లు తెలిసింది . ఈ ఆరు రకాల ఉత్పత్తులూ . . . ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా కాలుష్యానికి కారణం అవుతున్నాయి . 2022 నాటికి రీసైక్లింగ్ కాని ప్లాస్టిక్ ఉత్పత్తుల్ని పూర్తిగా నిషేధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని మోదీ . . . అక్టోబర్ 2న ప్లాస్టిక్ బ్యాన్ క్యాంపెయిన్ ను ప్రారంభించి . . . పై ఆరు రకాల ఉత్పత్తుల్నీ నిషేధిస్తారని తెలిసింది . 2014లో అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ ప్రారంభించిన మోదీ . . . 2019లో అదే రోజున ప్లాస్టిక్ బ్యాన్ ఉద్యమాన్ని కూడా ప్రారంభించబోతున్నారు . బ్యాన్ విధించిన వస్తువుల ఉత్పత్తి . . అక్టోబర్ 2 నుంచీ ఆగిపోతుంది . వాటి వాడకం , దిగుమతులు కూడా నిలిచిపోతాయి . ఇక ఎక్కడా , ఎవరూ ఆ వస్తువుల్ని అమ్మడం , కొనడం , వాడటం వంటివి జరగరాదన్నది కేంద్రం తీసుకురాబోతున్న ఆదేశం . మొదట్లో ఏ జరిమానాలు విధించకుండా . . . ఆరు నెలల పాటూ సమయం ఇవ్వాలనుకుంటున్న కేంద్రం . . . ఆ తర్వాత మాత్రం కఠినమైన ఫైన్లు వేస్తుందని తెలిసింది . ఇప్పటికే చాలా రాష్ట్రాలు పాలిథిన్ బ్యాగ్లను నిషేధించాయి . సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ( ఒక్కసారి వాడిపడేసే ప్లాస్టిక్ వస్తువులు ).
వస్తువుల్ని నిషేధిద్దామని ఆగస్ట్ 15న ప్రధాని మోదీ పిలుపిచ్చారు . అందుకు అక్టోబర్ 2ను డెడ్ లైన్ గా పెట్టారు . కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది . ఎందుకంటే భూమిలో కలవని ప్లాస్టిక్ పదార్థాలు . . . సముద్రాలు , డ్రైనేజీల్లో పేరుకుపోయి . . . తీవ్ర కాలుష్యానికి దారితీస్తున్నాయి . మనం తాగే నీటిలో , తినే ఆహార పదార్థాల్లో కూడా . . . ప్లాస్టిక్ అణువులు కలుస్తున్నాయి . 2021 నాటికి స్టాలు , ఫోర్క్ , కత్తులు , కాటన్ బడ్స్ వంటి వాటిని నిషేధించాలని యూరోపియన్ యూనియన్ టార్గెట్ పెట్టుకుంది . చైనాలోని షాంఘై . . . క్రమంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తోంది . అలాగే అక్కడి హైనాన్ దీవి . . . 2025 నాటికి ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా ఆపేస్తామని ప్రకటించింది . భారత్ రద్దు చేసే ఆరు రకాల ప్లాస్టిక్ ఉత్పత్తులూ . . . మొత్తం ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో దాదాపు 10 శాతం ఆక్రమిస్తున్నాయి . ఇండియా ఏటా 1 . 40 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ను ఉపయోగిస్తోంది . నిషేధం తర్వాత . . . రీసైక్లింగ్ చేయగలిగే ప్లాస్టిక్ పదార్థాల్ని మాత్రమే . ఉత్పత్తి చేస్తారని సమాచారం . ఈ - కామర్స్ కంపెనీలు సైతం . . . ఈ రూల్స్ పాటించాలని కేంద్రం ఆదేశించనుంది . మొత్తం ప్లాస్టిక్ ప్యాకేజింగ్లో ఈ కంపెనీలు 40 శాతం వాటా కలిగివున్నాయి .

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :