Read also:
నవోదయ విద్యాలయ సమితిలో 2370 ఉద్యోగాలు.
ఉపాధ్యాయులకు శుభవార్త.నవోదయ విద్యాలయ సమితిలో 2370 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు.నవోదయ విద్యాలయ సమితిలో పీజీటీ, టీజీటీతో పాటు అసిస్టెంట్ కమిషనర్, పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్, పీఈటీ లాంటి పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తుకు ఆగస్ట్ 9 చివరి తేదీ. మొత్తం 2370 ఉద్యోగాలున్నాయి. వాటిలో టీజీటీ-1154, పీజీటీ-430, మ్యూజిక్, ఆర్ట్, పీఈటీ, లైబ్రేరియన్-564, అసిస్టెంట్ కమిషనర్-05, ఫీమేల్ స్టాఫ్ నర్స్-55, లీగల్ అసిస్టెంట్-01, కేటరింగ్ అసిస్టెంట్-26, లోయర్ డివిజన్ క్లర్క్-135 పోస్తులున్నాయి.
ముఖ్యమైన తేదీలు ఇవే... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2019 జూలై 10 దరఖాస్తు ముగింపు: 2019 ఆగస్ట్ 09 ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 2019 ఆగస్ట్ 12 రాతపరీక్ష: 2019 సెప్టెంబర్ 5 - సెప్టెంబర్ 10 మధ్య ఉండొచ్చని అంచనా.
నవోదయ విద్యాలయ సమితి కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్వయంప్రతిపత్తిగల సంస్థ. పాఠశాల విద్య, అక్షరాస్యత, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా 8 ప్రాంతీయ కార్యాలయాలు ఉండగా 630 పైగా నవోదయ విద్యాలయాలున్నాయి. ఈ పాఠశాలల్లో 2370 పోస్టుల భర్తీ కోసం నియామక ప్రక్రియ చేపట్టింది నవోదయ విద్యాలయ సమితి. నియామక ప్రక్రియ పూర్తయ్యేసరికి పోస్టులు పెరగొచ్చు లేదా తగ్గొచ్చని నోటిఫికేషన్ లో వెల్లడించింది.
For more information check the official website
Download the notification form
For more information check the official website
Download the notification form