Wednesday, August 21, 2019

రాజధాని మార్పు ఫిక్స్



Read also:

ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించే యోచనలో వైసీపీ ప్రభుత్వం ఉందని గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది . బడ్జెట్ లో రాజధానికి జగన్ సర్కార్ కేటాయింపులు , తాజాగా అమరావతిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు రాజధానిని మార్చాలని జగన్ ప్రభుత్వం భావిస్తోందని స్పష్టం చేశాయి . ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి , తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి . వైసీపీ ప్రభుత్వం రాజధానిని దొనకొండకు మార్చడం ఖాయమని చింతామోహన్ వ్యాఖ్యానించారు . కేంద్రంతో ఇప్పటికే జగన్ చర్చలు కూడా జరిపారని ఆయన చెప్పారు . రాజధాని విషయంలో సీఎం జగన్ తొందరపడటం సరికాదని , రాజధానికి దొనకొండ ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు . అన్ని వనరులున్న తిరుపతిని రాజధానిగా చేయాలని చింతా మోహన్ ఓ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు . జగన్ సర్కార్ రాజధానిపై అనుసరిస్తున్న వైఖరితో భూములిచ్చినరైతుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :