Thursday, July 18, 2019

Flip kart ending sale offers



Read also:

Filipkar ending sale (Last day) Offers

ఫ్లిప్ కార్ట్ బిగ్ షాపింగ్ డేస్.. చివరి రోజు ఆఫర్లు ఇవే న్యూఢిల్లీ: ఫ్లిప్ కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ కు నేడే చివరి రోజు. ఈ నెల 15న మొదలైన సేల్ నేటి అర్ధరాత్రితో ముగియనుంది. మొబైల్స్, ఎల్ ఈడీ టీవీలు, స్పీకర్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై భారీ రాయితీలు ప్రకటించిన ఫ్లిప్ కార్ట్ చివరి క్షణం కూడా పలు డిస్కౌంట్లు అందిస్తోంది. ఎస్ బీఐ కార్డుతో కొనుగోలు చేసే వారికి అదనంగా పదిశాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.
Flipkart ending sale offers
ఫ్లిప్ కార్ట్ లో చివరి రోజు రెడ్ మి నోట్ 7ఎస్ 3జీబీ ర్యామ్ +32 జీబీ స్టోరేజీ వేరియంట్ ను రూ.9,999కే సొంతం చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.10,999. ఆనర్ 8సి మొబైల్ రూ.7,999కే అందుబాటులో ఉంది. బండిల్ ఎక్స్ చేంజ్ ఆఫర్ కింద రూ.7,350 వరకు తక్షణ రాయితీ లభిస్తుంది. ఈ ఫోన్ అసలు ధర రూ.12,999. ఆనర్ 20ఐపై ఫ్లిప్ కార్ట్ రూ.1000 రాయితీ అందిస్తోంది. పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్స్ చేంజ్ చేసుకోవడం ద్వారా ఈ ఫోన్ ను రూ.13,999కే సొంతం చేసుకోవచ్చు. రియల్ మి 3ప్రొపై రూ.500 తగ్గించి రూ.13,499కే అందుబాటులోకి తెచ్చింది. శాంసంగ్ 55 అంగుళాల 4కే స్మార్ట్ ఎల్ ఈడీ టీవీ ధర రూ.1,04,900 నుంచి ఏకంగా రూ.59,999కి దిగివచ్చింది. పాత టీవీ ఎక్స్ చేంజ్ పై రూ.18 వేల వరకు పొందవచ్చు. ఎస్ బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా మరో పదిశాతం రాయితీ లభిస్తుంది. వీయూ 40 అంగుళాల ఫుల్ హెచ్డి స్మార్ట్ ఎల్ ఈడీ టీవీ రూ. 16,999కే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 27 వేలు. ఏసర్ ని 5స్పిన్ 15.6 అంగుళాల ల్యాప్టాప్ ధరను రూ.76,445 నుంచి రూ.50,990కి తగ్గించి విక్రయిస్తోంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :